IPL 2023 | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2023)లో లక్నో జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డ్ చేస్తూ రాహుల్కు గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్కు దూరమయ్యాడు. ఇక అతని స్థానంలో అనుభవజ్ఞుడైన కరుణ్ నాయర్ని లక్నో తన జట్టులోకి తీసుకున్నది. అంతర్జాతీయ క్రికెట్లో కరుణ్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
టెస్టులు, రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్.. టెస్టుల్లో 62.33 సగటుతో 374 పరుగులు, వన్డేల్లో 23 సగటుతో 46 పరుగులు చేశాడు. టెస్టులో అత్యుత్తమ స్కోరు 303 నాటౌట్. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఇన్సింగ్స్ ఆడగా.. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా కరుణ్ 76 ఐపీఎల్ మ్యాచుల్లో 127.75 స్ట్రయిక్ రేట్తో 1,496 పరుగులు చేశాడు.
కరుణ్ నాయర్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తదితర ప్రాంచైజీల తరఫున ఆడాడు. ఇదిలా ఉండగా.. కేఎల్ రాహుల్ ఐపీఎల్తో పాటు ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ నుంచి సైతం వైదొలగుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో భారత్ జూన్ 7 నుంచి లండన్ ఓవల్ స్టేడియంలో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో తలపడనున్నది. కేఎల్ రాహుల్ ఐపీఎల్ ఈ సీజన్లో 34.25 సగటుతో 11322 స్ట్రయిక్ రేట్తో 274 పరుగులు చేశాడు. రాహుల్ గైర్హాజరీతో కృనాల్ పాండ్య కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్కు కృనాల్ కెప్టెన్గా వ్యవహరించాడు.