లక్నో: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 30వ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున నూర్ అహ్మద్ అరంగేట్రం చేస్తున్నాడు.
కాగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తం ఐదు మ్యాచ్లు ఆడి మూడు విజయాలు నమోదు చేసుకుంది. పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.