IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు. ఆఖరి ఓవరి వరకు ఫలితం తేలని మ్యాచ్లో ఢిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచింది. భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ శుభ్మన్ గిల్(67) అర్ధ శతకంతో కదం తొక్కడంతో పంజాబ్ కింగ్స్పై 7 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. మొదట పంజాబ్ను 153కే కట్టడి చేసిన గుజరాత్.. లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. డేవిడ్ మిల్లర్(17) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, సొంత గ్రౌండ్లో నెగ్గాలనుకున్న పంజాబ్కు నిరాశే మిగిలింది.
సామ్ కరన్ వేసిన 20వ ఓవర్లో ఏడు పరుగులు కావాలి. రెండో బంతికి శుభ్మన్ గిల్(67) బౌల్డ్ అయ్యాడు. దాంతో, స్టేడియం హోరెత్తిపోయింది. రాహుల్ తెవాటియా(5) బౌండరీ కొట్టి గుజరాత్ను గెలిపించాడు. డేవిడ్ మిల్లర్(17) నాటౌట్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు.
.@ShubmanGill brings up his 5️⃣0️⃣* 👏 👏@gujarat_titans need 34 runs in 24 balls.
Follow the match ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/cZZnq6h1Vt
— IndianPremierLeague (@IPL) April 13, 2023
లక్ష్యం పెద్దది కాకపోయినా.. గుజరాత్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(67), వృద్ధిమాన్ సాహా(30), తొలి వికెట్కు 48 రన్స్ జోడించారు. ఆ తర్వాత సాయి సుదర్శన్(19)తో కలిసి గిల్ స్కోర్ వేగం పెంచాడు. అర్ష్దీప్ సింగ్ 12వ ఓవర్లో వికెట్ తీసి బ్రేక్ ఇచ్చాడు. సమయోచితంగా ఆడిన గిల్ 40 బంతుల్లో 6 ఫోర్లతో యాభై రన్స్ కొట్టాడు. హార్దిక్ పాండ్యా(8) విఫలమయ్యాడు.
పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 153 రన్స్ చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మాథ్యూ షార్ట్(36), జితేశ్ శర్మ(25), సామ్ కరన్(22) మినహా ఎవరూ రాణించలేదు. ప్రభ్సిమ్రాన్ సింగ్(0), శిఖర్ ధావన్(8) విఫలమయ్యారు. చివర్లో షారుక్ ఖాన్(22) చెలరేగడంతో పంజాబ్ ఆ మాత్రం సోర్ చేయగలిగింది. గుజరాత్ తరఫున మొదటి మ్యాచ్లోనే మోహిత్ శర్మ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అల్జారీ జోసెఫ్, షమీ, రషీద్ ఖాన్, జోష్ లిటిల్ తలా ఒక వికెట్ తీశారు.