లక్నో: గుజరాత్ టైటాన్స్ జట్టు తన ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ బ్యాటింగ్కు అంతగా అనుకూలించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ముందు 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాటర్లతో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (47, 6 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66, 4 సిక్సులు, 2 ఫోర్లు) మాత్రమే రాణించారు.
మిగతా బ్యాటర్లలో విజయ్ శంకర్ (10, ఒక ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. గిల్ పరుగుల ఖాతా తెరుకుండానే ఔటయ్యాడు. అభినవ్ మనోహర్ (3), డేవిడ్ మిల్లర్ (6), రాహుల్ తెవాటియా (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇక లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ ఒక్కో వికెట్ పడగొట్టారు.