ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. దీనికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే దీని టీవీ, డిజిటల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.
ఈ క్రమంలోనే 2023-2027 వరకు బ్రాడ్కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ జరుగుతోంది. దీనికోసం తొలిసారిగా బీసీసీఐ ఈ-వేలం నిర్వహిస్తోంది. దీనిలో టీవీ బ్రాడ్కాస్టింగ్ హక్కులు సుమారు రూ.22500 కోట్లు చేరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విలువ రూ.19 వేల కోట్లు చేరిందట.
ఈ వేలాన్ని పరిశీలిస్తున్న నిపుణులు రేట్లు మరింత పెరుగుతాయని అంటున్నారు. టీవీ హక్కులు సుమారు రూ.25 వేల కోట్లకు చేరతాయని, అదే సమయంలో డిజిటల్ హక్కులు రూ.22 వేల కోట్ల వరకు పలుకుతాయని అంటున్నారు. ఇదంతా కేవలం భారత ఉపఖండంలో స్ట్రీమింగ్, బ్రాడ్కాస్టింగ్కు మాత్రమే కావడం గమనార్హం. ఈ లెక్కన ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ రూ.100 కోట్లు దాటిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇది 2018-2022 మధ్య రూ.55 కోట్లుగా ఉండేదట.