ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ హీట్ చివరి దశకు చేరింది. అభిమానులంతా ప్లేఆఫ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్లేఆఫ్స్కు వేదిక అయిన కోల్కతాలో వర్షం పడే సూచన ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ రోజున వర్షం పడితే ఏం చేస్తారని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
ఈ ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ రెండు మ్యాచులు కోల్కతాలోనే జరగబోతున్నాయి. వర్షం కారణంగా గనుక మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారట. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మ్యాచ్ ఆగిపోతే.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయిస్తారు.
లేదంటే వర్షం పడిన సమయాన్ని బట్టి ఓవర్లు కుదించి మ్యాచ్ ఆడించే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత క్వాలిఫైయర్-2, ఫైనల్ రెండు మ్యాచులు కూడా అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. క్వాలిఫైయర్-2 విషయంలో కూడా అవే రూల్స్ పాటిస్తారు. అయితే ఫైనల్ మ్యాచ్కు మాత్రం రిజర్వ్ డే ఉంది.
అంటే మ్యాచ్ గనుకు ఏదైనా కారణం వల్ల మధ్యలో ఆగిపోతే.. ఆగిపోయిన సందర్భం నుంచి మే 30న మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందు రోజు ఒక్క బంతి పడినా సరే.. ఆ తర్వాతి రోజు అక్కడి నుంచే మ్యాచ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.