జెనీవా: జపాన్ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ను నిర్వహించి తీరుతామని ఐవోసీ స్పష్టం చే సింది. ప్రజల అభిప్రాయాలను విన్నామని, అయి తే వాటిని పాటించలేమని ఐవోసీ నెలవారి సమావేశం తర్వాత వర్చువల్ మీడియా భేటీలో ప్రతినిధి మార్క్ ఆడమ్స్ వెల్లడించాడు. షెడ్యూల్ ప్రకారం జూలై 23 నుంచి ఒలింపిక్స్ జరుగాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతుండడంతో రద్దు చేయాలని మెజార్టీ జపాన్ ప్రజలు కోరుకుంటున్నారు.