హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. దాదాపు 45 దేశాల ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించే అవకాశమున్న ఇంటర్నేషనల్ స్నూకర్, బిలియర్డ్స్ టోర్నీ త్వరలో హైదరాబాద్లో జరుగనుంది. ఇందుకు సంబంధించి టోర్నీ నిర్వహకులు క్యూ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈవో ఆర్బీ గణేశ్, సీవోవో సుధాకర్శాస్త్రి, సీఏవో వీఎన్కుమార్ గణపతి.. మంగళవారం క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా టోర్నీ ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.