Manu Bhaker | షూటర్ మను భాకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని చర్ఖీ దాదరీలోని మహేంద్రగఢ్ బైపాస్ జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. స్కూటీ, బ్రెజ్జా కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత.. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం సివిల్ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పారిస్ ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్ మామయ్య యుధ్వీర్ సింగ్ ప్రా, అమ్మమ్మ సావిత్రిదేవి ప్రాణాలు కోల్పోయారు. యుధ్వీర్ (50) రోడ్వేస్ డ్రైవర్ కాగా.. సావిత్రి దేవి (70) కూడా క్రీడాకారిణి. ఆమె కూడా జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. యుధ్వీర్ ఇల్లు మహేంద్రగఢ్ బైపాస్లో ఉంది. స్కూటీపై డ్యూటీకి వెళ్తున్నాడు. అదే సమయంలో ఆయన వెంట సావిత్రిదేవిని తీసుకెవెళ్తున్నారు. తమ్ముడి ఇంటి వద్ద దింపేందుకు వెళ్తున్న సమయంలో కలియానా మలుపు వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పుతూ వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సావిత్రిదేవి, యుధ్వీర్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.