INDWvsENGW: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచ్లను గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వాంఖడే వేదికగా ముగిసిన రెండో మ్యాచ్లో ఇంగ్లండ్.. భారత్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ నిర్దేశించిన 81 పరుగుల ఛేదనను ఆ జట్టు 11.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలీస్ క్యాప్సీ (21 బంతుల్లో 25, 4 ఫోర్లు) రాణించింది. ఆఖర్లో భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టినా అప్పటికే ఇంగ్లండ్ విజయం ఖరారు కావడంతో వాటితో ఫలితం మారలేదు.
స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడింది. రేణుకా సింగ్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్లు ఔటయ్యారు. సోఫీయా డంక్లీ (9), డానియల్ వ్యాట్ (0) లు మూడు పరుగుల వ్యవధిలో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటంతో ఓపెనర్ల తర్వాత క్రీజులోకి వచ్చిన క్యాప్సీ, సీవర్ బ్రంట్ (16) మూడో వికెట్కు 42 పరుగులు జోడించి ఇంగ్లండ్ను విజయం దిశగా నడిపించారు.
విజయం ముంగిట వికెట్లు పడ్డా…
ఆడిన 13 బంతుల్లోనే రెండు బౌండరీలు, ఒక సిక్సర్సాయంతో 16 పరుగులు చేసిన సీవర్ను పూజా వస్త్రకార్ 8 ఓవర్లో బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వా్మ్యానికి తెరపడింది. ఆ తర్వాత వర్ వేసిన సైకా ఇషాక్.. క్యాప్సీ ని ఔట్ చేసింది. అమన్జ్యోత్ కౌర్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో క్యాప్సీ నిష్క్రమించింది. 11వ ఓవర్ వేసిన దీప్తి శర్మ.. ఇంగ్లండ్కు డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. ఆమె వేసిన రెండో బంతికి వికెట్ కీపర్ అమీజోన్స్ (5) పూజాకు క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఆ మరుసటి బంతికే ఫ్రెయా కెంప్ కూడా వికెట్ల ముందు దొరికిపోయింది. విజయం ముంగిట వరుసగా వికెట్లు కోల్పోయినా ఇంగ్లండ్ సారథి హెథర్ నైట్ (7 నాటౌట్), ఎక్లిస్టోన్ (9 నాటౌట్)లు లాంఛనాన్ని పూర్తిచేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మలు తలా రెండు వికెట్లు తీయగా ఇషాక్, పూజాలు చెరో వికెట్ తీశారు.
Second win in Mumbai in as many games and England clinch the T20I series 🏆
India fought with the ball but the visitors were always ahead after the first innings
👉https://t.co/8DjuMZqO1V | #INDvENG pic.twitter.com/oFKCx2olZH
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2023
ఈ విజయంతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. రెండ్రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్లో కూడా భారత్కు పరాభవం తప్పలేదు. ఈ సిరీస్లో నామమాత్రమైన మూడో టీ20 ఇదే వేదికపై ఆదివారం జరగాల్సి ఉంది.