భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. న్యూజిల్యాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు ప్రభావం చూపలేకపోతున్నారు. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కూడా టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఐదు వన్డేల సిరీసులో వరుసగా మూడు మ్యాచులు ఓడిన భారత మహిళలు.. మిగతా రెండు మ్యాచులైనా గెలిచి పరువు నిలుపుకుంటారని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
నాలుగో వన్డేలో భారత జట్టు 63 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీ మహిళలు.. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేశారు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఏ కోశానా కోలుకునేలా కనిపించలేదు. ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ మిథాలీ రాజ్ (30), రిచా ఘోష్ (52) జట్టును ఆదుకున్నారు.
ఈ క్రమంలో అత్యంత వేగంగా అర్థశతకం సాధించిన భారత మహిళా క్రికెటర్గా రిచా రికార్డు సృష్టించింది. ఆమె 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. కానీ మిగతా బ్యాటర్లంతా విఫలమవడంతో భారత జట్టు 17.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. కివీ మహిళలు 63 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 4-0 ఆధిక్యంలో నిలిచారు.
.@13richaghosh played a fighting knock, but that was not enough to take #TeamIndia over the line
New Zealand win the fourth #NZWvINDW ODI in Queenstown!
We will see you for the fifth & final WODI on Thursday.
Scorecard ➡️ https://t.co/zyllD1fpIm
📸 📸: @PhotosportNZ pic.twitter.com/dwwS3FUc5N
— BCCI Women (@BCCIWomen) February 22, 2022