INDvsNZ: ఇండియా – న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి సెమీస్లో భారత్ దూకుడుగా ఆడుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్.. 30 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 214 పరుగులు చేసింది. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని తర్వాత బ్యాటర్లూ కొనసాగిస్తున్నారు. 41 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి శతకం దిశగా సాగిన ఓపెనర్ శుభ్మన్ గిల్ (65 బంతుల్లో 79, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. రోహిత్, గిల్లు లేకున్నా విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ పూర్తిచేయడంతో పాటు శ్రేయస్ అయ్యర్ సాయంతో భారత ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు.
అర్థ సెంచరీ తర్వాత శాంట్నర్ వేసిన 17వ ఓవర్లో 6, 4 బాదిన గిల్ గ్లెన్ ఫిలిప్స్ వేసిన 20వ ఓవర్లో మరో సిక్సర్ కొట్టడంతో భారత స్కోరు 150 దాటింది. 70లలోకి వచ్చి శతకం దిశగా సాగుతున్న గిల్కు ఎండ వేడిమితో పాటు కండరాలు పట్టేడయంతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.
Shubman Gill is walking off…!!!!
He scored 79 runs from 65 balls, feel for him, playing so well in the Semis but unfortunately he has cramps. pic.twitter.com/t8CzreA4Zq
— Johns. (@CricCrazyJohns) November 15, 2023
రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన విరాట్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా శ్రేయస్ అయ్యర్ స్కోరు వేగాన్ని పెంచే బాధ్యత తీసుకున్నాడు. రచిన్ రవీంద్ర వేసిన 27వ ఓవర్లో 6, 4 బాదాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన కోహ్లీ అర్థ సెంచరీ పూర్తయింది. 30 ఓవర్లకు టీమిండియా 214 పరుగులు చేయగా కోహ్లీ ( 65 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (19 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.