INDvsNZ: వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఎప్పటిలాగే టీమిండియా సారథి రోహిత్ శర్మ (29 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడగా మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ దానిని కొనసాగిస్తున్నాడు. అర్థ సెంచరీకి మూడు పరుగుల ముందే రోహిత్ నిష్క్రమించి నిరాశపరిచినా అతడున్నంతసేపూ భారత స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది.
తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాది భారత ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించిన హిట్మ్యాన్.. సౌథీ వేసిన నాలుగో ఓవర్లో ఫోర్, సిక్సర్ బాదాడు. రోహిత్ బాదుతుండటంతో కేన్ విలిమయ్సన్.. ఆరో ఓవర్లోనే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ను బరిలోకి దించాడు. ఆ ఓవర్లో రెండో బంతికి రోహిత్ ఫోర్ కొట్టడంతో 38 బంతుల్లోనే భారత్ స్కోరు అర్థ సెంచరీ దాటింది. అయితే దూకుడుగా ఆడుతున్న రోహిత్ను సౌథీ పెవిలియన్కు పంపాడు.
Half-century number 1⃣3⃣ in ODIs for Shubman Gill!
💯 up for #TeamIndia 👌👌
Follow the match ▶️ https://t.co/FnuIu53xGu#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/PWOHxSlwHo
— BCCI (@BCCI) November 15, 2023
రోహిత్ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడిన గిల్.. అతడు ఔట్ అయ్యాక స్కోరు వేగాన్ని పెంచే బాధ్యతను తీసుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన పదో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. అతడే వేసిన 13వ ఓవర్లో 4,6 బాదడంతో భారత స్కోరు వంద పరుగులు దాటింది. రచిన్ రవీంద్ర వేసిన 14వ ఓవర్లో మూడో బంతికి సింగిల్ తీసిన గిల్ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్.. ఒక వికెట్ నష్టపోయి 118 పరుగులు చేసింది. గిల్ (52 నాటౌట్), విరాట్ కోహ్లీ (16 నాటౌట్) క్రీజులో ఉన్నారు.