INDvsENG: త్వరలో భారత పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇండియాకు రానున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ మేరకు పూర్తి సన్నద్ధమవుతోంది. స్పిన్కు అనుకూలించే ఉపఖండపు పిచ్లపై భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలికకాదన్న సంగతి తమకు తెలుసని, భారత్ కచ్చితంగా టర్నింగ్ ట్రాక్ (స్పిన్ పిచ్లు) లను తయారుచేస్తుందని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో అంటున్నాడు. భారత పర్యటనకు సిద్ధమవుతున్న అతడు.. స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బెయిర్ స్టో మాట్లాడుతూ… ‘కచ్చితంగా ఇండియా ఈ టూర్లో డిఫరెంట్ పిచ్లను తయారుచేస్తుంది. అవి టర్నింగ్ పిచ్లా లేవా అన్నది త్వరలోనే తేలుతుంది. అయితే స్పిన్ పిచ్లు కాకపోయినా వాళ్ల (టీమిండియా) పేస్ దళం ఎంత బలంగా ఉందో మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. నేనైతే ఇండియా కచ్చితంగా టర్నింగ్ పిచ్లను తయారుచేస్తుందని నమ్ముతున్నా. స్పిన్ పిచ్లు అయితే అది వారి బౌలింగ్ దళాన్ని తగ్గించినట్టే అవుతుంది. చివరిసారి మేం ఇక్కడకు వచ్చినప్పుడు అక్షర్, అశ్విన్ చాలా బాగా ఆడారు. టూర్లో ఫస్ట్ మ్యాచ్లో జో రూట్ సెంచరీ చేయగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్షర్, అశ్విన్, జడేజా, కుల్దీప్.. ఇలా ఎవరు ఆడినా వాళ్లంతా క్వాలిటీ స్పిన్నర్లే. వారిని ఎదుర్కోవడం చాలా కష్టం’ అని అన్నాడు.
భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్.. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగాల్సి ఉంది. జనవరి 25 నుంచి మొదలుకాబోయే టెస్టు సిరీస్… మార్చి 07 నుంచి 11 దాకా ధర్మశాల వేదికగా జరుగబోయే ఆఖరి టెస్టుతో ముగుస్తుంది. 2021లో ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించినప్పుడు భారత్ 3-1 తేడాతో సిరీస్ను గెలుచుకుంది.