టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మళ్లీ విజయాల బాట పట్టాడు. ఆరో రౌండ్లో ఓడిన గుకేశ్.. 8వ రౌండ్లో భారత్కే చెందిన విదిత్ గుజరాతిని ఓడించాడు. ఫ్రాన్స్ ప్లేయర్ ఫిరోజా అలీరెజాతో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు.
8 రౌండ్లు ముగిసేసరికి గుకేశ్ 5 పాయింట్లతో రష్యా ఆటగాడు ఇయాన్ నెపొమియాచితో సమానంగా కొనసాగుతున్నాడు. హికారు నకముర (4.5) ప్రజానంద (4.5), ఫాబియానో (4) లు తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.