హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న అండర్-19 టీ20 టోర్నీలో భారత యువ ఆల్రౌండర్ గొంగడి త్రిష సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నది. గురువారం కివీస్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో యువభారత్ 30 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత సోనియా (38)కు తోడు త్రిష (32) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 145/8 స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో కివీస్ 20 ఓవర్లలో 115/8 స్కోరుకు పరిమితమైంది. సధు (2/19), సోనమ్ (2/18)కు తోడు త్రిష (1/20) ఆకట్టుకుంది.