లాడర్హిల్(ఫ్లోరిడా): భారత్ ఖాతాలో మరో సిరీస్లో చేరింది. వెస్టిండీస్తో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమ్ఇండియా టీ20 సిరీస్ను ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన నాలుగో మ్యాచ్లో విండీస్పై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 191/5 స్కోరు చేసింది. వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్(31 బంతుల్లో 44, 6ఫోర్లు), కెప్టెన్ రోహిత్శర్మ(33, 2 ఫోర్లు, 3 సిక్స్లు), సంజూ శాంసన్(30 నాటౌట్, 2ఫోర్లు, సిక్స్) రాణించారు.
గాయం నుంచి కోలుకున్న రోహిత్..సూర్యకుమార్ యాదవ్(24)తో కలిసి జట్టుకు మెరుగైన శుభారంభం అందించాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 53 పరుగులు జోడించారు. ఆఖర్లో పంత్, శాంసన్ ధాటిగా ఆడారు. అక్షర్పటేల్ సుడిగాలి ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో భారీ స్కోరు అందుకుంది. మెక్కాయ్, జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన విండీస్ 19.1 ఓవర్లలో 132 ఆలౌటైంది. అర్ష్దీప్సింగ్(3/12), అవేశ్ఖాన్(2/17), అక్షర్పటేల్(2/48), రవి బిష్ణోయ్(2/27) సమిష్టి ప్రదర్శనతో విండీస్ పతనాన్ని శాసించారు. కెప్టెన్ నికోలస్ పూరన్(24), రోవ్మన్ పావెల్(24) మినహా అందరూ విఫలమయ్యారు. అవేశ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.