ICC Test Championship : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూసిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) ముగిసింది. వరుసగా రెండోసారి ఫైనల్లో భారత జట్టు(TeamIndia)కు భంగపాటు తప్పలేదు. వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రేలియా(Australia) సంచలన ఆటతో టీమిండియాను చిత్తు చేసింది.
తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా ఆ జట్టు టెస్టు గదను దక్కించుకుంది. దాంతో, ఇక భారత జట్టు ఆశలన్ని మూడో టెస్టు చాంపియన్షిప్పైనే. 2023-25 మధ్య భారత్ మొత్తం 14 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. షెడ్యూల్ పరంగా చూస్తే.. తొలి టెస్టు సిరీస్ వెస్టిండీస్ పర్యటనతో మొదల్వనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత భారత జట్టు మొదట వెస్టిండీస్(Westindies Tour) పర్యటనకు వెళ్లనుంది. రెండు టెస్టుల సిరీస్లో.. జూలై 12వ తేదీన తొలి టెస్టు ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్లో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్కు వెళ్తుంది. అక్కడ డిసెంబర్ – జనవరి మధ్యలో రెండు టెస్టులు ఆడుతుంది. 2024 జనవరి, ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్తో 5 టెస్టులు ఉన్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు భారత పర్యటనకు రానున్నాయి. భారత జట్టు ముందుగా బంగ్లాతో రెండు, ఆ వెంటనే కివీస్తో మూడు టెస్టు మ్యాచ్లు ఆడనుంది.
శుభ్మన్ గిల్
ఓవల్ స్టేడియంలో జరిగిన టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా గెలుస్తుందని అనుకున్నారంతా. దాంతో, 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కల నిజమవుతుందని భావించారు. కానీ, జరిగింది వేరు. ఫైనల్లో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. 209 పరుగులతో ఆసీస్ అద్భుత విజయం సాధించి టెస్టు గదను తన్నుకుపోయింది. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 469 రన్స్ కొట్టింది. ఆ తర్వాత బోలాండ్, కమిన్స్ విజృంభించడంతో భారత్ 269 పరుగులకే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్ను ఆసీస్ 270 వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల ఛేదనలో టీమిండియా ఏ దశలోనూ విజయానికి చేరువగా రాలేదు. విరాట్ కోహ్లీ(49), అజింక్యా రహానే(46), శ్రీకర్ భరత్(23) పోరాడినా లాభం లేకపోయింది.