తమల్పూర్(అస్సాం) : ఆసియన్ ఖోఖో చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు చాంపియన్లుగా నిలిచాయి. ఇరు విభాగాలలోనూ భారత జట్లు నేపాల్పై గెలుపొందాయి. పురుషుల ఫైనల్లో భారత జట్టు ఇన్నింగ్స్, ఆరు పాయింట్ల తేడాతో గెలుపొందగా, మహిళల జట్లు ఇన్నింగ్స్, 33 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ చాంపియన్షిప్లో ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియాలనుంచి మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి.