బుస్టో అర్సిజియో (ఇటలీ): ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. సెమీఫైనల్ బెర్తుతో విశ్వక్రీడల బెర్తు దక్కించుకుంటాడనుకున్న యువ బాక్సర్ నిశాంత్దేశ్ నిరాశపరిచాడు.
మంగళవారం జరిగిన పురుషుల 71కిలోల క్వార్టర్స్లో నిశాంత్దేవ్ 1-4 తేడాతో ఒమరి జోన్స్(అమెరికా) చేతిలో ఓటమిపాలయ్యాడు. హోరాహోరీగా సాగిన పోరులో నిశాంత్ పోరాటపటిమ కనబర్చినప్పటికీ అమెరికా బాక్స ర్ దీటుగా బదులివ్వడంతో ఓటమి ఎదుర్కొవాల్సి వచ్చింది.