లక్నో: న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రాంచీలో తొలి మ్యాచ్ చేజార్చుకున్న టీమ్ఇండియా మలి మ్యాచ్లో గెలిస్తేనే నిలిచే పరిస్థితి కొనితెచ్చుకుంది. వన్డే సిరీస్ విజయమిచ్చిన జోష్తో పొట్టి ఫార్మాట్లో కివీస్ భరతం పడుదామనుకున్న భారత్కు భంగపాటు ఎదురైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్సేనను కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్తో నిలువరించింది. అయితే లక్నోలో ఆదివారం ఏకానా స్టేడియంలో జరిగే మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భారత్ చూస్తుంటే..మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.