అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్లో భారత్కు చెందిన ప్రంజల్ శ్రీవాస్తవ సత్తాచాటాడు. ఈ అంతర్జాతీయ టోర్నీలో మూడో బంగారు పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మూడు మ్యాథ్ ఒలింపియాడ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారతీయుడిగా ప్రంజల్ రికార్డు సృష్టించాడు.
నార్వేలోని ఓస్లోలో ఈ నెల 11, 12 తేదీల్లో ఒలింపియాడ్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీలో 34 పాయింట్లు సాధించిన ప్రంజల్ బంగారు పతకం అందుకున్నాడు. అంతకుముందు 2019 ఒలింపియాడ్లో 35 పాయింట్లు, 2021 ఒలింపియాడ్లో 31 పాయింట్లు సాధించిన ప్రంజల్.. ఈ టోర్నీల్లో కూడా బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు.