Japan Open 2023 | టోక్యో: భారత యువ షట్లర్ లక్ష్యసేన్.. జపాన్ ఓపెన్ సెమీఫైనల్లో పోరాడి ఓడాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం 21 ఏండ్ల లక్ష్యసేన్ 15-21, 21-13, 16-21తో ఐదో సీడ్ జోనాథన్ క్రిస్టి చేతిలో పరాజయం పాలయ్యాడు.
హోరాహరీ పోరులో లక్ష్యసేన్ తొలి గేమ్ కోల్పోయినా.. రెండో గేమ్ గెలిచి తిరిగి పోటీలోకి వచ్చాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో క్రిస్టి జోరు కనబర్చగా.. కీలక సమయాల్లో పాయింట్లు కోల్పోయిన లక్ష్యసేన్ సెమీస్తోనే పోరాటం ముగించాడు.