డర్బన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ముందంజ వేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో శ్రీజ 4-1(11-6, 11-9, 9-11, 11-4, 11-5) తేడాతో నికోల్ అరిలియా(ఇటలీ)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన శ్రీజ వరుస గేముల్లో మ్యాచ్ను తన సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన ఈ తెలంగాణ ప్యాడ్లర్ మరోమారు సత్తాచాటాలని చూస్తున్నది.