Nikhat Zareen | న్యూఢిల్లీ: బల్గేరియా వేదికగా ఫిబ్రవరి 1 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక టోర్నీకి భారత యువ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై ఎంపికయ్యారు. సోమవారం జాతీయ బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
మహిళల విభాగంలో నిఖత్, లవ్లీనతో పాటు ప్రీతి, సాక్షి, మనీశ, అరుంధతి చోటు దక్కించుకున్నారు. పురుషుల కేటగిరీలో అమిత్, బరుణ్సింగ్, సచిన్, ఆకాశ్, వన్షజ్, రజత్, ఆకాశ్, దీపక్, అభిమన్యు, జుగ్ను, నవీన్కుమార్, సాగర్ ఉన్నారు.