Boxing | అస్తానా: ఏషియన్ అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు ప్రత్యర్థులపై పసిడి పంచ్లు విసురుతున్నారు. అస్తానా వేదికగా సోమవారం జరిగిన వేర్వేరు కేటగిరీలలో భారత బాక్సర్లు ఐదు స్వర్ణాలు గెలుచుకున్నారు.
పురుషుల 48 కిలోల ఫైనల్లో బ్రిజేష్ 5-0 తేడాతో ముమినోవ్ (కిర్గిస్థాన్)ను మట్టికరిపించాడు. ఆర్యన్ (51 కిలోలు) 5-0తో కిర్గిస్థాన్కే చెందిన కమిలోవ్ను ఓడించి భారత ఆనందాన్ని డబుల్ చేశాడు. 63.5 కిలోల విభాగంలో యశ్వర్ధన్ 4-1తో తజకిస్థాన్ బాక్సర్ గఫురోవ్ రుస్లన్ను చిత్తు చేశాడు. మహిళల 52 కిలోల కేటగిరీలో నిషా.. 5-0తో ఒటిన్బె(కజకిస్థాన్)ను మట్టికరిపించగా లక్ష్మీ (52 కిలోలు) రిఫరీ స్టాప్ ది కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) నిర్ణయంతో నొముండరి (మంగోలియా)పై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.