న్యూయార్క్: న్యూయార్క్ టోర్నీలో భారత యువ అథ్లెట్ పారుల్ చౌదరీ పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 3000మీటర్ల స్టిపుల్చేజ్ ఫైనల్ రేసును పారుల్ 9:41:88 సెకన్ల టైమింగ్తో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం అమెరికాలో శిక్షణ పొందుతున్న పారుల్కు ఈ సీజన్లో ఇదే తొలి పతకం. పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ 28 ఏండ్ల యువ స్ప్రింటర్ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (9:38:09సె) కంటే మరో మూడు సెకన్ల సమయం ఎక్కువ తీసుకుంది.