కేప్టౌన్: భారత మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్’లో చోటు దక్కించుకుంది. ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపచంకప్లో రిచా మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటింది. రిచా గ్రూప్ మ్యాచ్లలో 31 నాటౌట్(పాకిస్థాన్పై), 44 నాటౌట్(వెస్టిండీస్పై), 47 నాటౌట్(ఇంగ్లండ్పై) స్కోర్లతో విమర్శకుల మెప్పు పొందింది. కాగా ఆరోసారి కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టునుంచి నలుగురు క్రీడాకారిణులు ఈ జట్టులో చోటు సంపాదించారు.
ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ : తజ్మిన్ బ్రిట్స్, అలిస్సా హీలీ, లారా వుల్వర్త్, నథాలీ షివర్ బ్రంట్, ఆష్లీ గార్డ్నర్, రిచా ఘోష్, సోఫీ ఎకల్స్టోన్, కరిష్మా రామ్హరాక్, షబ్నిమ్ ఇస్మాయిల్, డార్సి బ్రౌన్, మెగన్ షట్, ఓర్లా పెండర్గాస్ట్.