Womens Cricket Team : బంగ్లాదేశ్ గడ్డ(Bangladesh Soil)పై భారత మహిళల జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. టీ20 సిరీస్లో దుమ్మురేపిన టీమిండియా వన్డే సిరీస్(ODI Series)లో అదే జోరు కనబర్చడంలో విఫలమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మిర్పూర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో అనూహ్యంగా ఓటమి పాలైంది. వన్డే క్రికెట్ చరిత్ర(Team India ODI History)లో బంగ్లాదేశ్ చేతిలో భారత మహిళల జట్టు పరాజయం చెందడం ఇదే తొలిసారి. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో అతిథ్య జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వర్షం కారణంగా డకవర్త్ లూయిస్ పద్ధతి(DLS Method) ప్రకారం మ్యాచ్ను 44 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నిగార్ సుల్తానా(Nigar Sultana) 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. దేవిక వైద్య 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు.
తొలి వన్డే గెలిచిన ఆనందంలో బంగ్లా క్రికెటర్లు
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత బ్యాటర్లు నిరాశ పరిచారు. మ్యాచ్కు ముందు రోజు ఇలాంటి స్లో పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టమన్న టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మాటలే నిజమయ్యాయి. బౌలర్లకు సహకరిస్తున్న వికెట్పై మనవాళ్లు పెవిలియన్కు వరుస కట్టారు. స్మృతి మందన (11), ప్రియా పునియా (10), యస్తిక భాటియా (15), హర్మన్ ప్రీత్ కౌర్ (5), జెమీమా రోడ్రిగ్స్ (10), ఆల్రౌండర్ దీప్తి శర్మ (20), అమన్జ్యోత్ (15) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు చేరారు. ఫలితంగా భారత జట్టు 35.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దాంతో, ఆతిథ్య జట్టు 40 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లా బౌలర్లలో మారూఫా అక్తర్ 4, రాబియా ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. సిరీస్లో కీలకమైన రెండో వన్డే జూలై 19న జరుగనుంది.