రాజ్కోట్: భారత మహిళల క్రికెట్ జట్టు(Indian Womens Team).. వన్డేల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐర్లాండ్తో రాజ్కోట్లో జరిగిన మూడవ వన్డేలో 304 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. గతంలో ఐర్లాండ్పైనే 2017లో 249 రన్స్ తేడాతో నెగ్గింది ఇండియా. అయితే ఇవాళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సెంచరీలు చెలరేగారు. ఆ ఇద్దరూ తొలి వికెట్కు 233 రన్స్ జోడించారు.
స్టాండ్ ఇన్ కెప్టెన్ స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. 70 బంతుల్లోనే ఆమె సెంచరీ కొట్టింది. 80 బంతుల్లో ఆమె 135 రన్స్ చేసింది. మంధాన ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ప్రతీకా రావల్.. వన్డేల్లో తొలి సెంచరీ చేసింది. 129 బంతుల్లో ఆమె 154 రన్స్ చేసి ఔటైంది. 12 పరుగుల వద్ద మంధాన ఇచ్చిన క్యాచ్ను కీపర్ క్రిస్టినా వదిలేసింది.ఇక ఆ తర్వాత స్మృతి తన పవర్ హిట్టింగ్తో చెలరేగింది.
భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏ దశలోనే పోరాట స్పూర్తిని ప్రదర్శించలేదు. వరుసగా ఆ జట్టు వికెట్లను కోల్పోయింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఫోర్బ్స్ 41, ప్రెండర్గాస్ట్ 36 రన్స్ చేశారు.
🚨 𝙍𝙚𝙘𝙤𝙧𝙙 𝘼𝙡𝙚𝙧𝙩 🚨
With a 3⃣0⃣4⃣-run victory in the series finale, #TeamIndia registered their Biggest ODI win (by runs) in women’s cricket 👏 🔝
Well done! 🙌 🙌
Scorecard ▶️ https://t.co/xOe6thhPiL#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/3yGIheSB7X
— BCCI Women (@BCCIWomen) January 15, 2025