హాంగ్జూ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరింది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత్.. వర్షం కారణంగా మలేషియాతో పోరు రైద్దెనా.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్లో వర్షం కారణంగా మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించగా.. స్మృతి మందన సారథ్యంలో బరిలోకి దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి (16 బంతుల్లో 27; 5 ఫోర్లు) జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చి వెనుదిరగగా..
ఆ తర్వాత షఫాలీ వర్మ (39 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (47 నాటౌట్; 6 ఫోర్లు) దంచికొట్టారు. చివర్లో రిచా ఘోష్ (7 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించడంతో భారత్ కొండంత స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో మలేషియా ఒక్క ఓవర్ కూడా ఆడకముందే వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎంత ఎదురుచూసినా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో చివరకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.