మనామా: అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5-0తో బహ్రెయిన్ను చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ (18వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో చెలరేగితే.. సంగీత (13వ ని.లో), ఇందుమతి (34వ ని.లో), మనీశ (69వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఫిఫా ర్యాంకింగ్స్లో 57వ స్థానంలో ఉన్న భారత జట్టుకు 85వ ర్యాంకర్ బహ్రెయిన్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తదుపరి పోరులో బుధవారం చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది.