పల్లెకెలె: పొట్టి ఫార్మాట్లో లంకను చిత్తు చేసిన భారత మహిళల జట్టు.. వన్డే ఫార్మాట్లో లంకేయులతో అమీతుమీకి సిద్ధమైంది. దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం భారత జట్టు ఆడనున్న తొలి వన్డే సిరీస్ ఇదే కానుండగా.. కొత్త సారథి హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో మన అమ్మాయిలు బరిలోకి దిగనున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా.. ఫీల్డింగ్లో మరీ వెనుకబడి ఉన్న టీమ్ఇండియా.. ఆ లోపాన్ని అధిగమించాలని భావిస్తున్నది.