గువాహటి: భారత మహిళా షట్లర్స్ జోడి అశ్విని పొన్నప్ప, తనీష క్రాస్టొ గౌహతి మాస్టర్స్ సూపర్-100 టైటిల్ను గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ అశ్విని-తనీష 21-13, 21-19 స్కోరుతో 81వ ర్యాంక్ జోడి చైనీస్ తైపీకి చెందిన సంగ్ షో యున్-యు చీన్ హల్లపై 40 నిమిషాలలో విజయం సాధించారు.
ఈ యేడాది ఈ జోడీకి ఇది మూడో టైటిల్. అంతకుముందు అబుధాబి మాస్టర్స్ సూపర్-100, నాన్టెస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలలో టైటిల్స్ సాధించారు.