టోక్యో: ఒలింపిక్స్ హాకీ రెండో మ్యాచ్లోనూ ఓడింది ఇండియన్ వుమెన్స్ టీమ్. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ గ్రేట్ బ్రిటన్తో బుధవారం ఉదయం జరిగిన మ్యాచ్లో 1-4 తేడాతో ఇండియా ఓడిపోయింది. నాలుగు క్వార్టర్లలో ఒక్కో గోల్ చేసుకుంటూ వెళ్లిన బ్రిటన్.. తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ తరఫున 23వ నిమిషంలో షర్మిలా దేవి మాత్రమే ఏకైక గోల్ చేసింది. బ్రిటన్ తరఫున మార్టిన్ హన్నా రెండు గోల్స్ చేయగా.. లిలీ ఓస్లీ, గ్రేస్ బాల్స్డన్ చెరో గోల్ చేశారు. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో మన టీమ్ ఓడిన విషయం తెలిసిందే.