న్యూఢిల్లీ : భారత మహిళా డబుల్స్ షట్లర్స్ అశ్విని పొన్నప్ప, తనీష క్రాస్టొ బిడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు మెరుగై 28వ ర్యాంక్కు చేరుకున్నారు. 36 ఏళ్ల అశ్విని, 20 ఏళ్ల తనీష ఈ యేడాది జనవరినుంచి డబుల్స్ విభాగంలో భాగస్వాములుగా ఆడుతున్నారు. ఇటీవల ముగిసిన సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్గా నిలిచారు.
అంతకుముందు నేట్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ, అబుదాబి మాస్టర్స్ సూపర్-100 టోర్నీలను గెలుచుకున్నారు. కాగా ఇతర భారత ఆటగాళ్లు తమ ర్యాంకింగ్లలోనే కొనసాగుతున్నారు. హెచ్ఎస్ ప్రణయ్ 8, లక్ష్య సేన్ 17, కిడాంబి శ్రీకాంత్ 24, పివి సింధు 12, సాత్విక్-చిరాగ్ 2, త్రిషా జాలి-గాయత్రి గోపిచంద్ 19 ర్యాంక్లలో నిలిచారు.