ముంబై: భారత మహిళల జట్టు వరుసగా రెండో పరాజయంతో టీ20 సిరీస్ కోల్పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో మన అమ్మాయిలు.. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఇంగ్లిష్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 16.2 ఓవర్లలో 80 పరుగులకు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (30) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. షఫాలీ వర్మ (0), స్మృతి మంధన (10), హర్మన్ప్రీత్ (9), దీప్తి (0), రిచ (4), పూజ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరారు. అనంతరం ఇంగ్లండ్ 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. దీప్తి, రేణుక చెరో 2 వికెట్లు తీసి ఇంగ్లిష్ టీమ్పై ఒత్తిడి పెంచినా.. లక్ష్యం చిన్నది కావడంతో సునాయాసంగా గెలిచింది.