లండన్: భారత మహిళా క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వా మి.. మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీకి ఎంపికైంది. గోస్వామితో పాటు ఇంగ్లం డ్ ప్లేయర్లు హీతర్ నైట్, ఇయాన్ మోర్గాన్కు ఇందులో చోటు దక్కింది.
నిరుడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జులన్.. రెండు దశాబ్దాల పాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. భారత్ తరపున 204 వన్డేలాడి 255 వికెట్లు పడగొట్టిన జులన్.. 12 టెస్టుల్లో 44 వికెట్లు తీసింది.