న్యూఢిల్లీ : భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రముఖ క్రీడా సామాగ్రి సంస్థ ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితురాలైంది. హర్మన్ప్రీత్ యేడాది అంతటా ప్యూమా సంస్థ పాదరక్షలు, దుస్తులు, ఇతర ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించనున్నది.
ఈ ఒప్పందంతో హర్మన్ప్రీత్ విరాట్ కోహ్లీ, ఉసేన్ బోల్ట్, నెయ్మర్ జూనియర్, సునీల్ ఛెత్రి, మేరీ కోమ్, వంటి దిగ్గజాల సరసన చేరింది. 33 ఏళ్ల హర్మన్ప్రీత్ టీ20లలో నాలుగో అత్యంత వేగవంతమైన సెంచరీ తన పేరిట లిఖించుకుంది.