ఉత్తమ నగర జీవనానికి పునాది
కాజీపేట : ఉత్తమ నగర జీవన విధానానికి పట్టణ ప్రగతి పునాదిలా దోహదపడుతుందని నగర మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రేటర్ 61వ డివిజన్ బాబు క్యాంప్లో అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలకు పూలమాలలు వేసి, పలు ప్రాంతాల్లో హరితహారం మొక్కలు నాటారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ ఎలకంటి రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ అభివృద్దిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. త్వరలోనే కమ్యూనిటీ హాల్లో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 8న అన్ని శాఖల అధికారులతో కలిసి పర్యటిస్తామన్నారు. కార్యక్రమంలో చీఫ్ఎంహెచ్వో రాజిరెడ్డి, ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్, సూపర్వైజింగ్ అధికారి దామోదర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కోటిలింగం, సాంబయ్య, వెంకటస్వామి, హరి, సంపత్కుమార్ పాల్గొన్నారు.
రాంపేట గ్రామంలో..
మడికొండ : గ్రేటర్ 45వ డివిజన్ రాంపేట గ్రామంలో పట్టణ ప్రగతిలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మేయర్ సుధారాణి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం మడికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సూపర్ మార్కెట్ను మేయర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, సీహెచ్వో రాజారెడ్డి, అరూరి రంజిత్ పాల్గొన్నారు.
గ్రేటర్ పరిధిలో 13 లక్షల మొక్కలు
వరంగల్ : హరితహారంలో భాగంగా గ్రేటర్ పరిధిలో 13 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు చేశామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఆమె మొక్కలు నాటి మాట్లాడారు. గ్రేటర్కు చెందిన 17 నర్సరీల్లో 17 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, సీహెచ్వో సునీత, సిటీ ప్లానర్ వెంకన్న, డీసీపీ ప్రకాశ్రెడ్డి, సూపరింటెండెంట్ అనిల్, సంతోష్, బల్దియా జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్ పాల్గొన్నారు. అలాగే, 29వ డివిజన్లోని కమ్యూనిటీ హాల్లో పట్టణ ప్రగతి వార్డు కమిటీ ఏర్పాటు సమావేశంలో మేయర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణ ప్రగతి లక్ష్యసాధనకు వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. సమావేశంలో పట్టణ ప్రగతి సూపర్వైజర్ శ్రీనివాస్రావు, టీపీబీవో స్రవంతి, సీవో రిజిత, లావణ్య, వార్డు కమిటీ సభ్యులు కొడకండ్ల సదాంత్, తాళ్లపల్లి రమేశ్, రుద్ర శ్రీను, శ్రీరాముల సురేశ్, శ్రీను, సబ్బని రాజు, సంజీవ్, షఫీ, రాచర్ల జగన్, సతీశ్, నవీన్, సారంగం, పాషా, ముజీద్, జ్యోతి, హేమలత, షర్మీళ, సునీత, వాడిక నాగరాజు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
ఐనవోలు : గ్రామాల అభివృద్ధే పల్లె ప్రగతి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని పంథినిలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి మొక్క నాటి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కర్మిళ్ల ప్రేమలత అధ్యక్షతన జరిగిన సమావేశంలో అరూరి రమేశ్ మాట్లాడారు. పంథినిని మోడల్ విలేజీగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్కుమార్, మండల ప్రత్యేకాధికారి నాగేశ్వర్రావు, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీటీసీ బోయినపల్లి సోమేశ్వర్రావు, కార్యదర్శి తబుస్సం పాల్గొన్నారు.
దేశాయిపేటలో..
పోచమ్మమైదాన్ : వరంగల్ దేశాయిపేటలోని దళితవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. అనంతరం స్థానిక చర్చిలతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్రావు, కార్పొరేటర్లు సురేశ్కుమార్ జోషి, కావటి కవితా రాజు యాదవ్, వార్డు స్పెషల్ ఆఫీసర్ అశోక్, కార్పొరేషన్ డీఈ సంజయ్కుమార్ పాల్గొన్నారు.
చింతగట్టు క్యాంప్లో..
భీమారం : టీఎన్జీవోస్ కేంద్ర సంఘం పిలుపు మేరకు చింతగట్టు క్యాంప్లో హరితహారంలో భాగంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ వీరయ్య, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ సీతారాం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరి వేణుగోపాల్, హసన్పర్తి అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, కోశాధికారి రాజేశ్, నాయకులు ఆకుల రాజమౌళి, శ్యామ్సుందర్, అబ్దుల్ హమీద్, పగిడిద్దరాజు, వంశీకృష్ణ, షారుఖ్, మంజుల పాల్గొన్నారు.