టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహెయిన్.. ఏసియన్ గేమ్స్లో పాల్గొనే బృందంలో చోటు దక్కించుకుంది. ఆమెతోపాటు జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ మాజీ విన్నర్ నిఖత్ జరీన్ కూడా ఏసియన్ గేమ్స్కు ఎంపికైంది. వీరిద్దరూ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కూడా 52 కేజీల విభాగంలో నిఖత్, 70 కేజీల విభాగంలో లవ్లీనా క్వాలిఫై అయ్యారు.
ఇప్పుడు లవ్లీనా 69 కేజీల విభాగంలో, నిఖత్ 51 కేజీల విభాగంలో ఏసియన్ గేమ్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ట్రయల్ ఫైనల్స్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి ఏసియన్ గేమ్స్ మొదలవుతాయి.