కొలంబో: శ్రీలంక వేదికగా కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన లెజెండ్స్ క్రికెట్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లీగ్లో క్యాండీ స్వాంప్ ఆర్మీ యజమానిగా ఉన్న యోణి పటేల్.. పంజాబ్ రాయల్స్ మేనేజర్ ఆకాశ్తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డట్టు లంక మాజీ క్రికెటర్లు ఉపుల్ తరంగ, కివీస్ మాజీ క్రికెటర్ నీల్ బ్రూమ్ శ్రీలంక క్రీడాశాఖకు ఫిర్యాదు చేశారు.
వీళ్ల ఫిర్యాదుతో కొలంబోని స్థానిక కోర్టు నిందితుల పాస్పోర్టులపై నిషేధం విధించి దేశం విడిచివెళ్లొద్దంటూ ఆదేశాలు జారీచేసింది.