న్యూఢిల్లీ: జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన పోరులో భారత్ 3-1తో జపాన్పై విజయం సాధించింది. మన జట్టు తరఫున అరైజీత్ సింగ్ (36వ నిమిషంలో), శ్రద్ధానంద్ తివారీ (39వ ని.లో), ఉత్తమ్ సింగ్ (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
జపాన్ తరఫున యసుడా (19వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో జపాన్ ఆధిపత్యం కనబర్చగా.. ద్వితీయార్ధంలో మనవాళ్లు వరుస గోల్స్తో ప్రత్యర్థిని చిత్తు చేశారు. భారత్కు వరుసగా రెండో విజయం కాగా.. శనివారం పాక్తో తలపడనుంది.