Team India | న్యూజిలాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్, బంగ్లాదేశ్తో వన్డే, టెస్టు సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనున్నది. అక్కడ భారత జట్టు మూడు వన్డేల సిరీస్, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.
న్యూజిలాండ్లో టీ20 సిరిస్కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా సెలెక్టర్లు నియమించారు. రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. దినేశ్ కార్తీక్ను జట్టు నుంచి తప్పించారు. ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ విషయం తెలిసిందే. శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ టీ20 జట్టులో చోటు లభించింది.
దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ సైతం చోటుదక్కింది. టీ20 సిరీస్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. మరో వైపు మహ్మద్ షమీని పక్కనపెట్టగా.. ఉమ్రాన్ మాలిక్ టీ20 జట్టులో చోటుదక్కింది. చివరిసారిగా ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆడాడు. గంటకు 150 కిలోమీటర్లకుపైగా స్పీడ్తో బాల్ను విసిరే సత్తా ఉన్న ఉమ్రాన్ మాలిక్.. స్వదేశంలో న్యూజిలాండ్ను ఎదుర్కొనేందుకు ఎంపిక చేశారు.
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్-వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా,
సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర
చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు కెప్టెన్సీ బాధ్యతలను శిఖర్ ధావన్కు సెలెక్టర్లు అప్పగించారు. వన్డే సిరీస్కు సైతం రోహిత్, రాహుల్, కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్కు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అదే సమయంలో టీ20 సిరీస్ తర్వాత హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. వన్డే జట్టులోకి మెరుపు బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అవకాశం కల్పించారు. ఐపీఎల్-2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన మధ్యప్రదేశ్లోని రెవాకు చెందిన ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్కు అవకాశం వన్డే జట్టులో చోటు దక్కింది. మరో వైపు భువనేశ్వర్ కుమార్ను తప్పించగా.. ప్రపంచకప్కు ముందు గాయపడిన ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ పునరాగమనం చేయనున్నారు.
శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ – వికెట్ కీపర్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ పర్యటన అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నది. ముందుగా మూడు వన్డేల సిరీస్ ఆడనున్న టీమిండియా, ఆ తర్వాత రెండు మ్యాచ్ల టెస్టులో తలపడనున్నది. ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరనున్నారు. సిరీస్లో హార్దిక్కు విశ్రాంతినిచ్చారు. బంగ్లాదేశ్తో జరిగే వన్డే, టెస్టు సిరీస్లకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
వన్డే జట్టులో రజత్ పాటిదార్కు కూడా అవకాశం కల్పించారు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు రజత్ను భారత జట్టులోకి తీసుకున్నా.. అరంగ్రేటం చేసే అవకాశం దక్కలేదు. అదే సమయంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం కల్పించారు. ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. యష్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడాడు. మరో వైపు రవీంద్ర జడేజా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్ నుంచి జట్టుకు దూరమవగా.. షమీకి జట్టులో అవకాశం కల్పించారు. మరో వైపు కేఎస్ భరత్, కుల్దీప్ యాదవ్ టెస్టు జట్టులో అవకాశం కల్పించారు. రిజర్వ్ వికెట్ కీపర్గా భరత్ను తీసుకున్నారు.
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాల్.
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.