బెర్లిన్: స్పెషల్ ఒలింపిక్స్లో భారత స్విమ్మర్లు సత్తాచాటారు. బెర్లిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగియగా.. ఇందులో మనవాళ్లు 16 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో 4 స్వర్ణాలు, 10 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి.
మహిళల విభాగంలో దీక్ష, పూజ, ప్రసిద్ధి ప్రకాశ్.. వేర్వేరు విభాగాల్లో స్వర్ణ పతకాలు చేజిక్కించుకున్నారు. పురుషుల 25 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో మదన్ మాధవ్ పసిడి గెలుచుకున్నాడు. పతకాలు నెగ్గిన స్విమ్మర్లను భారత హెడ్కోచ్ ఆయుశ్ యాదవ్, రాజశేఖర్, విష్ణుకుమార్ తదితరులు అభినందించారు.