Korea Open 2023 | న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం సాత్విక్-చిరాగ్ జంట 21-14, 21-17తో టకురో హోకీ-యోగో కోబాషి (జపాన్) ద్వయంపై విజయం సాధించింది.
40 నిమిషాల్లో ముగిసిన పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ భారత జోడీ.. వరుస గేమ్ల్లో విజృంభించింది. గత నెలలో ఇండోనేసియా ఓపెన్ సూపర్-1000 టైటిల్ నెగ్గిన తర్వాత బరిలోకి దిగి తొలి టోర్నీలోనే మనవాళ్లు సత్తాచాటారు. వరుస విజయాలతో సెమీఫైనల్లో అడుగుపెట్టారు.