సింగపూర్: భారత స్టార్ షట్లర్లు సింగపూర్ ఓపెన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పటికే పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ పరాజయం పాలవగా.. స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా నిష్రమించింది.
తొలి రౌండ్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 18-21, 21-14, 18-21తో అకిరా కోగా-తైచీ సైటో జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ కూడా పరాజయం పాలై ఇంటిబాట పట్టింది.