బాసెల్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు స్విస్ ఓపెన్లో చుక్కెదురైంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన తెలుగమ్మాయి శుక్రవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 15-21, 21-12, 18-21తో పుత్రి కుసుమ (ఇండోనేషియా) చేతిలో ఓడింది. నాలుగో సీడ్గా బరిలోకి దిగిన సింధు.. మూడు గేమ్ల పాటు సాగిన పోరులో అన్సీడెడ్ చేతిలో ఓటమి పాలైంది.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో భాగంగా జరుగుతున్న ఈ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లంతా ఇంటిబాటపట్టగా.. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ 12-21, 21-17, 28-26తో తైవాన్ ద్వయంపై గెలుపొందింది.