కోపెన్హగన్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో చుక్కెదురైంది. మొదటి రౌండ్లో బై దక్కించుకున్న సింధు.. మంగళవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14-21, 14-21తో ఒకుహారా (జపాన్) చేతిలో ఓడింది.
గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సింధు.. ఈ మ్యాచ్లోనూ వరుస గేమ్ల్లో ప్రత్యర్థికి తలవంచింది.