French Open | పారిస్: భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి టైటిళ్ల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. పారిస్ టోర్నీపై తమ ప్రేమను కనబరుస్తూ రెండోసారి టైటిల్ను సగర్వంగా ముద్దాడారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-11, 21-17తో చైనీస్ తైపీ జోడీ లీ జీ హ్యుయ్, యాంగ్ పో హుసాన్పై అద్భుత విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఈ ప్రపంచ నంబర్వన్ జోడీ ఆద్యంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన సాత్విక్, చిరాగ్..ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వలేదు.
2019లో రన్నరప్గా నిలిచిన ఈ యువ జంట..2022లో టైటిల్ విన్నర్గా నిలిచింది. ఈ సీజన్లో తొలి టైటిల్ను ఖాతాలో వేసుకుని తమకు తిరుగులేదని ఘనంగా చాటిచెప్పారు. ఇటీవల మలేషియా సూపర్-1000 టోర్నీ, ఇండియా సూపర్-750, చైనా మాస్టర్స్ టోర్నీల్లో రన్నరప్గా నిలిచిన సాత్విక్, చిరాగ్..ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్తో సత్తాచాటారు. రానున్న ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో సాత్విక్, చిరాగ్ జోడీ కచ్చితంగా స్వర్ణం సాధిస్తుందని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు.